అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని దొడగట్ట గ్రామ పొలాల్లో పేకాట స్థావరం పై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రొద్దం ఎస్సై నాగస్వామి మాట్లాడుతూ దొడగట్ట గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండీ రూ. 47, 700/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.