ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో విద్యార్థిని బలవన్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 09:46 AM

చదువే లోకంగా ఉన్న ఓ ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు వివరాల మేరకు. పుట్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని (17) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె సోమవారం తరగతులకు వెళ్లలేదు. కుటుంబంలో సమస్యలతో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న తల్లితండ్రులు బోరున విలపించారు. సున్నిత మనస్కురాలైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో పలువురు ఆందో ళనకు గురయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com