రైతులు లక్షల టన్నుల ధాన్యం వరికల్లాల్లో ఉండడంతో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, రెండవ పంట చేతికి వస్తున్న తరుణంలో కూడా స్పష్టమైన విధానం అవలంభించడం లేదని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నాయకులూ సోము వీర్రాజు విమర్శించారు. రైతు సమస్యలు తీర్చకపోతే రైతుల పక్షాన మేము ప్రభత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టవలసి వస్తుంది అని హెచ్చరించారు.