కరోనా పుట్టినిల్లు చైనాలో....మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. రెండేళ్ల తర్వాత గరిష్ఠ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడంతో.....డ్రాగన్ సర్కారు అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నగరాల్లో లాక్ డౌన్ విధించిన డ్రాగన్ ఆంక్షలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దక్షిణ ప్రాంతంలో ప్రధాన సాంకేతిక కేంద్రమైన షెన్ జెన్ లో వైరస్ కట్టడి పేరుతో కోటి 70లక్షల మందిని నిర్బంధించింది.