2014 సంవత్సరాన సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన రాజకీయ పార్టీ జనసేన. డబ్బుకి , మద్యానికి అమ్ముడుపోకుండా ప్రజలు అలోచించి మంచి సమాజం కోసం మంచి నాయుడుని ఎన్నికోవాలి అనే నినాదం తో , అలానే ప్రశ్నించడం మన జన్మ హక్కు , తప్పు చేసే రాజకీయ నాయకులను ప్రజల తరఫున ప్రశ్నించి , ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాము అని భరోసాతో తో ముందుకు వచ్చిన పార్టీ జనసేన. కానీ 2014 ఎన్నికలలో టీడీపీ పార్టీ కి మద్దతు తెలిపి తాను ఎన్నికలబరిలో నిలవలేదు. అలానే 2019 ఎన్నికలలో తమ పార్టీ తరపున వ్యక్తులను నిలబెట్టి , పోటీ చేసి నప్పటికీ ఘోర పరాజయ పాలు ఐనది. ఈ సమయంలో రాజోలు నియోజక వర్గంలో మాత్రమే విజయం సాధించింది. కానీ కొన్ని కారణాల వలన ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి పరిణామాలు జరిగిన నేపథ్యంలో నేడు జనసేన ఆవిర్భావ సభకి నీకు ప్రవేశం లేదు అంటూ జనసైనికులు పోస్టర్స్ ద్వారా తెలియచేసారు.