నాటు సారా తయారీ చేసే వారికి శాఖాపరమైన చర్యలు తప్పవని చిత్తూరు రూరల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ జి మోహన్ బాబు హెచ్చరించారు. ఆదివారం ఎస్ ఇబి సిబ్బందులు మరియు ఫారెస్ట్ రేంజర్ సిబ్బందులతో కలసి చిత్తూర్ రూరల్ మండలం పరిధిలోని రంగనాయుని చెరువు గ్రామ అటవీ సమీప ప్రాంతంలో సారా తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 800 వందల సారాయి తయారీ తయారుచేసిన సారా ఊటలను ధ్వంసం చేసి ఇ అందుకు సంబంధించిన సామాగ్రి లను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.