జంగారెడ్డి గూడెం పరిధిలో నాటు సారా తాగి దాదాపు 30 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. దీని మీద చర్చ జరగాలి అని ప్రధాన ప్రతిపక్షం ఐన తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాల్లో అడగగా , మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబే.. జంగారెడ్డిగూడెం సహజ మరణాలపై టీడీపీ శవరాజకీయం చేస్తోంది. బాబు లాంటి నీచమైన ప్రతిపక్షనేత దొరకడం రాష్ట్రానికి దౌర్భాగ్యం అని వైసీపీ మంత్రి కోడలి నాని అన్నారు. దీనితో తెలుగుదేశం నాయకులూ అసెంబ్లీ ఆవరణలో ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియ చేసారు. తెలుగు దేశం వారికి చెప్పకపోయినా సమయం వచ్చినప్పుడు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది అని ఎప్పుడు తెలుసుకుంటారో....