నిరుద్యోగులకు ఈఎస్ఐసీ గుడ్న్యూస్ అందించింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) రూ.1.42 లక్షల వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్ గ్రేడ్-2, సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 93 ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఈఎస్ఐసీ కోరుతోంది. అభ్యర్థుల వయోపరిమితి ఏప్రిల్ 12, 2022 నాటికి 21 నుంచి 27 ఏళ్ల వయసు ఉండాలని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందుకోనున్నట్లు వెల్లడించింది. ఆయా పోస్టులకు కామర్స్, లా, మేనేజ్మెంట్ను విద్యార్హతగా నిర్ణయించారు. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకునేందుకు తుది గడువును ఏప్రిల్ 12, 2022గా నిర్ణయించారు.