ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా తగ్గిన కరోనా కేసులు..

national |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 09:57 AM

 భారతదేశంలో కరోనా ఖతం కావడానికి దగ్గరిలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో భారీగా కేసులు తగ్గిపోతున్నాయి.పాజిటివ్ కేసులు గతంలో కంటే తక్కువ సంక్యలో రికార్డు అవుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా 2 వేల 503 కరోనా కేసులు నమోదయ్యాయని, 27 మంది వైరస్ బారిన పడి చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నాటక రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని అక్కడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


మరోవైపు కరోనా వైరస్ వెలుగు చూసిన చైనాలో గత పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోసారి వైరస్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ – 19 కేసుల్లో దేశంలోని రెండు అతిపెద్ద నగరాలైన షెన్ జాన్, షాంఘై వైరస్ లు వ్యాపించడంతో కఠినమైన ఆంక్షలు విధించాయి. మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చైనా చాంగ్‌చున్‌లో కరోనా విజృంభిస్తోంది. 90 లక్షల జనాభా ఉండే చాంగ్‌చున్‌లో దాదాపు 4 వందల కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చాంగ్‌చున్‌లో లాక్‌డౌన్‌ విధించారు. గత రెండు రోజుల నుంచి అధికారులు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇక చైనాలో శనివారం 15 వందల కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 తర్వాత అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com