ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్‌కు ఇది దీపావళి కానుక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2017, 01:58 PM

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించడం పట్ల ఆ రాష్ట్రమంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అందుకోనున్న రాహుల్‌గాంధీకి ఈ విజయం దీపావళి కానుక అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ విజయం రాహుల్‌గాంధీకి మేమిచ్చే అద్భుతమైన దీపావళి గిఫ్ట్‌. అకాలీ దళ్‌ నేత సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌కు ఈ ఫలితం చెంప పెట్టు. పంజాబ్‌లో అకాలీ దళ్‌ భారమని భాజపా గుర్తించాలి.’ అని సిద్ధూ ఎద్దేవా చేశారు. గురుదాస్‌పూర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జాఖర్‌ 1,93,219 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సునీల్‌కు అభినందనలు తెలియజేశారు. ‘కాంగ్రెస్‌ విధానాలు, అభివృద్ధికి లభించిన విజయం ఇది’ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. గురుదాస్‌పూర్‌ ప్రజలకు సునీల్‌ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com