అమృత్సర్: పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల ఆ రాష్ట్రమంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకోనున్న రాహుల్గాంధీకి ఈ విజయం దీపావళి కానుక అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ విజయం రాహుల్గాంధీకి మేమిచ్చే అద్భుతమైన దీపావళి గిఫ్ట్. అకాలీ దళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్కు ఈ ఫలితం చెంప పెట్టు. పంజాబ్లో అకాలీ దళ్ భారమని భాజపా గుర్తించాలి.’ అని సిద్ధూ ఎద్దేవా చేశారు. గురుదాస్పూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ 1,93,219 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సునీల్కు అభినందనలు తెలియజేశారు. ‘కాంగ్రెస్ విధానాలు, అభివృద్ధికి లభించిన విజయం ఇది’ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. గురుదాస్పూర్ ప్రజలకు సునీల్ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.