కరోనా విపత్కర కాలంలో కూడా వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆంధ్ర బార్డర్ లో దాదాపు 2156 మంది,మద్యం, గుట్కా,ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని విధులు నిర్వహిస్తున్న SPO( స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ )ల గోడు వినండి జగన్ గారు. దాదాపు 11 నెలలుగా వాళ్లకు జీతాలు అందడం లేదు, వాళ్ళ గోడు వినే నాథుడే లేడు.. ఏ అధికారీ వాళ్ళకి న్యాయం చేయలేకపోయాడు. కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం దైనందినంగా ఉంది.. వారికి న్యాయం చేయాలని కోరుచున్నాను అని టీడీపీ నాయకులూ పరిటాల శ్రీరామ్ తెలిపారు.