కేరళలోని వెంగార అసెంబ్లీ ఉప ఎన్నికలో యూడీఎఫ్ విజయం సాధించింది. యూడీఎఫ్ అభ్యర్థి కేఎన్ఏ ఖాదర్ 65వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 2016 ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 1327 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి 5728 ఓట్లు మాత్రమే వచ్చాయి. వెంగార సిట్టింగ్ ఎమ్మెల్యే, ఐయూఎంఎల్ నేత పీకే కున్హాలికుట్టీ ఈ ఏడాది ఏప్రిల్లో మలప్పురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది.