వెస్టిండీస్తో జరుగుతున్న మహిళల వరల్డ్కప్ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన, మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగారు.న్యూజిలాండ్పై బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ చేజార్చుకున్న ఇండియన్ వుమెన్స్ టీమ్.. వెస్టిండీస్పై చెలరేగిపోయింది. స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ సెంచరీల మోత మోగించడంతో విండీస్పై భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 317 రన్స్ చేసింది టీమిండియా. చివరి రెండు ఓవర్లలో కేవలం 6 పరుగులే వచ్చాయి. లేదంటే టీమ్ మరింత భారీ స్కోరు సాధించేదే.