ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశ పెడుతుండగా గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులు బడ్జెట్ కు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ వారిని వారించారు. అయినా వారు వినలేదు. దీంతో మంత్రి బుగ్గన సభ్యులు ఇష్టం లేకుంటే సభ నుంచి వెళ్లి పోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సంయమనం పాటించాలని స్పీకర్ చెప్పి శాంతింప చేశారు.