ఏపీ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సుమారు రూ.2.50 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఉంటుందని సమాచారం. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్ ఏ విధంగా రూపొందించారనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత బడ్జెట్ కంటే రూ.20 - 25 వేల కోట్లు అదనంగా ఉండే అవకాశం ఉంది. సుమారు రూ.లక్ష కోట్ల మేర నవరత్నాలకు కేటాయించే అవకాశం ఉంది.