ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు చాలా మంది ప్రముఖులకు నిస్తేజం మిగిల్చాయి. పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఉత్తరాఖండ్ లో భాజపా గెలిచినా సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు. ఉత్తరాఖండ్ లో మాజీ సీఎం హరీశ్ రావత్. గోవాలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటి చేసిన మాజీ సీఎం చర్చిల్ అలెమావోలకు భంగపాటు తప్పలేదు. పంజాబ్ లో ఆప్ జోరులో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు... ప్రకాశ్ సింగ్ బాదల్ , అమరీందర్ సింగ్ , రాజీందర్ కౌర్ భట్టల్ లు కొట్టుకుపోయారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధు, శిరోమణి అకాళీదల్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ లను కూడా ఆప్ ఊడ్చేసింది. ప్రముఖ నటుడు, వితరణ శీలి సోనూ సూద్ సోదరి మాళివిక్ సూద్ కు అదృష్టం కలిసి రాలేదు.