పాఠశాల అభివృద్ధికి నోచుకోవడంలేదంటుూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి వాసులు నిరసన తెలిపారు. స్కూల్ గేట్ కు తాళం వేశారు. ఉన్నత తరగతులకే పరిమితమైన పాఠశాలకు ప్రాథమిక తరగతులు కలపడంతో గదుల కొరత ఏర్పడిందని. ఈ విషయాన్ని ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.