బాపట్ల మండల పరిధిలోని నందిరాజుతోట గ్రామంలో దాసరి పుల్లమ్మ (40) అనే మహిళ పెద్ద కాలువలో మంచినీళ్లు కోసం వెళ్లి కాలుజారి కాలువలో పడిపోయింది. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసుకువచ్చారు. చికిత్స కోసం వైద్యశాలకు తర లించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.