కృష్ణా జిల్లా పునర్విభజన జరగనున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వశాఖలకు సంబంధించి జిల్లా కార్యాలయాలకు అవసరమైన భవనాలను అధికారులు సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాడనున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేటు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ భవనాలలో ఏర్పాటు చేయనున్నారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం కట్టిన భవనంలో కలెక్టరేట్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నూతన ఎన్టీఆర్ జిల్లాకుకలెక్టరేట్ తోపాటు అన్ని జిల్లాస్థాయి కార్యాలయాలనూ ఒకే చోట ఏర్పాటు చేసేందుకు అనువైన భవనాలను అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఉన్న భవనం కలెక్టరేటకు అనువుగా ఉంటుందని అధికారులు గుర్తించారు. కలెక్టరేట్ తోపాటు కీలకమైన జిల్లాస్థాయి కార్యాలయాలను అందులో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అయితే దేవదాయ శాఖ కమిషనరేట్ లో కలెక్టరేట్ ఏర్పాటుపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. వివాదాల మధ్య గొల్లపూడిలో భవనాలు చూసే బదులు నగరంలోని ఆర్తైండ్ బీ భవన్లో, పీఎన్బీఎస్లో ఖాళీగా ఉన్న బ్లాకులను పరిశీలించి తాత్కాలికంగా కలెక్టరేట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వ భవనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
నూతన విజయవాడ జిల్లాలో ప్రభుత్వ జిల్లాస్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేయటానికి పెద్దగా సమస్యలు లేవు. మొత్తం 75 ప్రభుత్వ శాఖలకు సంబంధించి చూస్తే 50 శాఖల వరకు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మచిలీపట్నంలో దాదాపు 50కు పైగా ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్టరేట్లో ఉన్న శాఖలు పోనూ అదనంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఘాండ్ బీ, అటవీ, ఇరిగేషన్, విద్యుత్, డ్వా మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్ తదితర అనేక శాఖలకు కార్యాలయాలను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలోని 75 శాఖలకు సంబంధించి జిల్లాస్థాయి కార్యాలయాల్లో పనిచేసే వారిని 50 శాతం దామాషా ప్రకారం ఇప్పటికే విభజించారు. మచిలీపట్నంలో ఉన్నా. విజయవాడలో ఉన్నా. ప్రతి జిల్లాస్థాయిలోని ఉద్యోగుల్లో సగం మంది అటు, ఇటు వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన సిబ్బంది ఎక్కడ వారు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగుల అభిప్రాయం లేకుండా జిల్లా కార్యాలయాల్లో పనిచేసే వారిని మాత్రమే విభజన చేయడం కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.