స్కోచ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్ధానంలో నిలవడంతో అసెంబ్లీలో సీఎం వైయస్. జగన్ కు పలువురు మంత్రులు అభినందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను కలిసి హర్షం వ్యక్తం చేశారు. వివిధ విభాగాల్లో స్కోచ్ అవార్డుల్లో ఏపీ మొదటి స్ధానంలో నిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. మంత్రులు కురుసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, పి అనిల్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో ఉన్నారు.