బండి ఆత్మకూరు మండలం దేవలాపురం గ్రామం దగ్గర ఏక శిలా ఆంజనేయ స్వామి గుడి దగ్గర నంద్యాల నుండి వెలుగోడు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారు వెలుగోడు వాసవి రైస్ మిల్ వారని సమాచారం. ఘటనా స్థలానికి పోలీస్లు చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించినట్లు స్థానికులు తెలిపారు.