కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టుకున్నట్లు ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. హల్వి గ్రామానికి చెందిన మహబూబ్, వడ్డే రాజు అనే వ్యక్తులు కర్ణాటక మద్యంతో వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద పట్టుబడినట్లు వివరించారు. తొమ్మిది బాక్సుల మద్యం, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. గ్రామాలలో అక్రమ మద్యం అరికట్టడానికి ప్రజలు సహకరించాలని కోరారు.