సినిమా పరిశ్రమ మీద అలానే సినిమా టికెట్స్ మీద జరుగుతున్నా వివాదం అంత ఇంత కాదు. కొంత మంది ఇది కేవలం పవన్ కళ్యాణ్ ని దెబ్బ తీయటానికి అని అంటున్నారు. ఈ విషయం మీద చిరంజీవి , మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు సీఎం జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. ఐనప్పటికే , ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వం , తాజాగా సినిమా టికెట్స్ రేట్ సవరిస్తూ జీవో విడుదల చేసింది. ఐతే , ఇది ఇప్పటివరకు ఆపడానికి కారణం , మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అని ప్రభుత్వం చెప్తుండగా,జనసేన మరియు టీడీపీ వర్గీయులు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా కోసమే ఆగారు,పవన్ ని దెబ్బ కొట్టాలని చేసే ప్రయత్నాలలో ఇది కూడా ఒకటి అని ప్రజలు సైతం వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా, వైసీపీ నాయకులూ మాత్రం సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినీ పరిశ్రమకి జగనన్న ఎప్పుడూ అండగానే ఉంటారు అని తెలియ చేస్తున్నారు.