విద్యుత్ స్తంభం పడిపోయి స్కూటీలు ధ్వంసమైన సంఘటన వినుకొండ పట్టణంలోని సట్టుబజార్ లో చోటు చేసుకుంది. 22వార్డ్ లో సట్టుబజార్ లోని జెండా చెట్టు ఎదురు శనివారం సాయంత్రం కరెంట్ పోల్ వేయటం జరిగింది. మంగళవారం ఉదయం పోల్ ఒక్కసారిగా పడిపోయింది. స్తంభం 2 స్కూటీ ల మీద పడిపోవడంతో స్కూటీ లు సైతం దెబ్బతిన్నాయి. మున్సిపాలిటీ వారికి కరెంట్ ఆఫీస్ వారికి కాల్ చేసిన ఒకరిమీద ఒకరు చెప్పుకొని ఇప్పటి వరకు స్పందన లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.