గుంటూరు లో జరుగుతున్న ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు విజయవంతం అయ్యాయి. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గత రెండురోజుల నుంచి సిపిఐ పార్టీ అనుబంధ సంస్ధ ఏఐటీయూసీ 17వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారు. సీపీఐ జాతీయ, రాష్ట్ర స్థాయి, ముఖ్య నాయకులు సభలకు హాజరయ్యారు. మంగళవారం సభల ముగింపు సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరై ప్రసంగించనున్నట్లు, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు.