ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యా యుద్ధానికి మరోసారి తాత్కాలిక విరామం ప్రకటించింది. కీవ్, మరియపోల్, సుమీ, చెర్నిహివ్ నగరాల్లో కాల్పుల విరామం ప్రకటించింది. సుమీలో 700 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి విదేశీయుల తరలింపునకు రష్యా అంగీకారం తెలిపింది. ఇందుకోసం యుద్ధ విరామం ప్రకటించింది.