మాజీ తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ ముకుల్ రాయ్ ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తన రాజీనామా లేఖను సమర్పించారు. మూడు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు కైలాష్ విజయ్వర్గీయను ముకుల్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నెల 25వ తేదీన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ముకుల్ ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నెపంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు.