ఉక్రెయిన్-రష్యా మధ్య కొద్ది రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఉక్రెయిన్లో నివసిస్తున్న భారత పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. కాగా*.. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్కు సంబంధించిన టీం కూడా రంగంలోకి దిగింది. భారత ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులకు తెలియపరుస్తోంది. అంతేకాకుండా భారత పౌరులు సురక్షితంగా ఉక్రెయిన్ వీడే విధంగా సహాయ సహకారాలు అందజేస్తోంది