ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరాశక్తిలో భద్రతా వారోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 05, 2022, 09:05 AM

పరాశక్తి సిమెంట్ పరిశ్రమ ఏటా జీరో ప్రమాదాలు నమోదు చేస్తోందని జిల్లా పరిశ్రమల ఉప చీఫ్ ఇన్స్పెక్టర్ బి.రాంబాబు అన్నారు. శుక్రవారం పరాశక్తి ఆవరణలో జరిగిన 51వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా పరిశ్రమ ఆవరణలో భద్రతా పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతపై అధికారులు, కార్మికులతో ప్రమాణం చేయించారు. పరిశ్రమల శాఖ నరసరావుపేట ఇన్స్పెక్టర్ బి. ఈశ్వరచంద్, పరాశక్తి చీఫ్ జీఎం ఎంఎస్ఎన్ రాజు, మల్లికార్జున రావు, నాగరాజు, గణపతి, రాజు తదితరులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com