అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు హర్షిస్తూ కోడూరులో టీడీపీ నేతలు సంబరాలు చేశారు. కోడూరు ప్రధాన సెంటర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద శుక్రవారం టెంకాయలు కొట్టి, పెద్ద ఎత్తున టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి టీడీపీ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇది రైతుల విజయమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారం అమరావతి రాజధాని అభివృద్ధి చేపట్టి, కేంద్రం అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన నిధులు సత్వరమే సక్రమంగా వెచ్చించి అమరావతి రాజధాని నిర్మించాలని, అమరావతి కోసం భూములిచ్చిన రైతుల ప్లాట్లను మూడు నెలల్లో అభివృద్ధి చేసి రైతులకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల టిడిపి అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు సుంకర లక్ష్మీ, మాజీ ఎంపీటీసీ బడే వీరబాబు, బెల్లంకొండ కోటేశ్వరరావు, బడే గాంధీ, అద్దంకి ఏడుకొండలు, మేకా రమేష్, దోనేపూడి బాబుజ్జి, పోతురాజు, పెద్ద ఎత్తున టిడిపి నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.