తమిళనాడు గవర్నర్గా బన్వరీలాల్ ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. నగరంలోని రాజ్భవన్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు, డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.