ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని దొడ్డిచిం తల పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో దశాబ్దాల క్రితం నిర్మించిన మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలు తుందోనని కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లర్లకు పెచ్చులూడుతున్నా యి. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపో యారు. అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.