రోజురోజుకూ పెరుగుతున్న రియల్ వెంచర్లు, అక్రమ లేఅవుట్ల కు చెక్ చెప్పేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా అనాథరైజ్డ్ రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీటీసీపీ అనుమతి లేని అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయవద్దని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు, లే అవుట్లను ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలకు వెనకాడొద్దని సూచించింది.