2022లో ఏడవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ భీమా పధకం ఇక నుంచి ప్రతి రైతు ఇంటి వద్దకే చేరాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎం ఎఫ్ బి వై అమలవుతున్న అన్ని రాష్ట్రాలలో "మేరి పాలసీ మేరే హాత్" డ్రైవ్ పేరిట పంట భీమా పత్రాలు రైతుల ఇళ్లకే వెళ్లి ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ డ్రైవ్ లో ప్రతి రైతుకి పి ఎం ఎఫ్ బి వై పధకం గురించి,భీమా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాల మీద పూర్తి అవగాహన కల్పిస్తారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం కలిగే ప్రతి రైతుకి ఆర్థికంగా అండగా నిలవాలనే ఆశయం తో పీఎం ఎఫ్ బి వై పథకాన్ని ఫిబ్రవరి 18, 2016 లో పీఎం నరేంద్ర మోడీగారు గారు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 4, 2022 నాటికి 1,07,059 కోట్ల రూపాయలతో 36 కోట్ల మంది రైతులు ఈ పధకం కింద భీమా పొందారు.ఆరు సంవత్సరాల క్రితం ప్రవేశ పెట్టబడిన ఈ పధకం 2020 లో రైతులు స్వచ్చందంగా పాల్గొనేలా పునరుద్ధరించబడింది. పంట నష్టం కలిగిన రైతులు కేవలం 72 గంటల్లోనే క్రాప్ ఇన్సూరెన్స్ ఆప్ లో కానీ, దగ్గర్లో ఉన్న CSCసెంటర్ లో లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ కి కానీ క్లెయిమ్ చేసుకోవాలి.