సైబర్ నేరాలపై విద్యార్థులకు బొండపల్లి ఎస్. ఐ ఆర్. వాసుదేవ్ అవగాహన కల్పించారు. గురువారం బొండపల్లి గ్రామ పరిధిలో గల అక్షర పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికలు మహిళల పట్ల బాధ్యతతో మెలగాలని సూచించారు. మహిళలు బాలికలకు దిశ యాప్ రక్షణ లాంటిదని, ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.