ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంఈఓ ఆఫీసు వద్ద నల్ల త్రాసు పాము కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 17, 2022, 03:58 PM

ప్రకాశం జిల్లా: కందుకూరు తహసీల్దారు కార్యాలయం ఆవరణలో ఉన్న ఎంఈఓ ఆఫీసు గేటు వద్ద గురువారం నల్ల త్రాసు పాము తారసపడింది. కార్యాలయం నుంచి వచ్చి ఓ కప్పను పట్టుకుని హాయిగా ఆరగించిం ఆ పక్కనే ఉన్న బధిరుల భవనం వెనుకకు వెళ్ళింది. ఆ భవనం చుట్టూ విపరీతమైన మరుగు ఉండటంతో ఆ పొదల్లోకి జొరబడింది. అదే భవనంలో మానసిక పిల్లల స్కూలు కూడా ఉంది. స్కూలు సమయం, పని వేళలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిల్లలు ఆటలాడుకునే సమయం అయితే పరిస్థితి ఎంటని అక్కడ త్రాసు పామును చూసిన వారు ఆందోళన చెందారు. ఇప్పటికైనా సంభందిత అధికారులు ఆఫీసులు చుట్టు భారీగా పేరుకుపోయిన మరుగును శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com