వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై కెప్టెన్ రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. శ్రేయస్ లాంటి ఆటగాడిని జట్టులోకి తీసుకోకపోవడం కష్టంగా ఉంటుందని అన్నాడు. అయితే మిడిల్ ఓవర్లలో బౌలింగ్ వేసే వారికోసం చూశామని, అందుకే అతన్ని తీసుకోలేదని రోహిత్ చెప్పాడు. జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్ల మధ్య ఇలాంటి పోటీ ఉండడం మంచిదేనని, ఇందులో నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయడం తనకు చాలా కష్టమైన ఆంశం అని రోహిత్ చెప్పాడు. ప్రపంచ కప్ కు ఎంపిక చేస్తామని శ్రేయస్ కు స్పష్టంగా చెప్పామని, ప్రతి ఆటగాడు జట్టకు ఏది అవసరమో అది చేయడానికి సిద్ధంగా ఉంటాడని రోహిత్ తెలిపాడు. ఇక ఇషాన్ కిషన్ లో ఆత్మవిశ్వసాన్ని నింపామని చెప్పాడు. ఇండియా తరఫున ఆడేటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుందని, దానిని పోగొట్టి అతడిని సౌకర్యంగా ఉంచడమే తమ లక్ష్యం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు.