ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

national |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 06:34 PM

భారత్ లో మూడు టి20లు, రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక జట్టు వస్తోంది. ఈ పర్యటనలో మార్పు చేసినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు వెల్లడించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను ప్రకటించింది. శ్రీలంక జట్టు భారత్ లో తొలుత 3 మ్యాచ్ ల టి20 సిరీస్ లో పాల్గొంటుందని, ఆ తర్వాత ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ జరుగుతుందని వివరించింది. ఈ క్రమంలో లక్నో తొలి టి20 మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుందని, మిగిలిన రెండు టి20 మ్యాచ్ లు ధర్మశాలలో జరుగుతాయని బోర్డు పేర్కొంది. ఇక, ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొహాలీలో మార్చి 4 నుంచి 8వరకు జరుగుతుందని, రెండో టెస్టు మార్చి 12 నుంచి 16 వరకు బెంగళూరు వేదికగా జరుగుతుందని వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com