విశాఖ అరకు ఘాట్ రోడ్డు టైడా సమీపంలో గల మలుపు వద్ద రాయపూర్ వైపు నుంచి వెళ్తున్న కూరగాయల బొలెరో వాహనం సోమవారం బోల్తాపడింది. దీని వివరాలు ఇలా ఉన్నాయి. రాయపూర్ నుంచి కూరగాయలు తీసుకొని విశాఖపట్నం వెళ్తున్న బొలెరో వాహనం బ్రేకులు పనిచేయకపోవడంతో బోల్తా పడింది అని పలువురు అన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.