ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాలు ప్రసాద్ యాదవ్ ను వెంటాడిన దాణ కుంభకోణం కేసు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 12:59 PM

లాలు ప్రసాద్ యాదవ్ కు కష్టాలు  మాత్రం వీడటం లేదు. దాణా స్కామ్ కు సంబంధించి ఐదో కేసులోనూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా జార్ఖండ్ లోని రాంచి సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. జడ్జి సీకే షైని ఆదేశాల మేరకు లాలూప్రసాద్ యాదవ్ మంగళవారం స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. డొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్లను అక్రమంగా తీసుకున్న కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు, శిక్షను ప్రకటించాల్సి ఉంది. మూడేళ్లకు మించి శిక్ష పడితే తిరిగి ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తుంది. పశువులకు ఉచిత దాణా పేరుతో కార్యక్రమం ప్రారంభించిన నాటి లాలూ సర్కారు ఆ పేరుతో నిధులను బొక్కేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. 2017 డిసెంబర్ నుంచి లాలూ ఎక్కువ కాలం జైలులోనే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్ లో చికిత్స కూడా తీసుకున్నారు. గతంలో నాలుగు కేసుల విషయంలో లాలూ దోషిగా నిర్ధారణ అవ్వగా, వీటిపై ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com