అనంతపురం జిల్లా: ఒడిసి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు వైపు నిలబడ్డ వ్యక్తి కి ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల మేరకు ఒడిసి - కదిరి రహదారిలో గల న్యూ విజ్ఞాన్ స్కూలు ఎదుట దినేష్ తన స్నేహితుడు ఇరువూరు మాట్లాడుతుండగా అటు నుండి వెళ్ళు ద్విచక్ర వాహనదారుడు రవి వాహనం అదుపు తప్పడంతో రవి, దినేష్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియజేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు, 108 సిబ్బంది పైలెట్ సనావుల్లా, ఈ టి ఎల్ సలీమ్ హుటాహుటిన చేరుకుని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.