గుంటూరు: సంగడిగుంట 22వ లైన్ కు చెందిన షేక్ బాషా అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా బాషా మద్యానికి అలవాటు పడ్డాడు. అయితే ఈ నెల 11న మద్యం సేవించి వచ్చాడు. మద్యం సేవించి వద్దని భార్య షేక్ జకీరా చెప్పింది. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాషా పురుగులమందు సేవించి నురగ కక్కుతున్నాడని పక్కింటి వారు చెప్పడంతో వెంటనే ఆమె బాషాను ఆసుపత్రికి తరలించింది. బాషా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు