విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిరసనలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈటీవీ భారత్ కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వ అతిథి గృహం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి.. విశాఖ పర్యటన నేపథ్యంలో.. కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.