ఏపీలో వైసీపీ అరాచక పాలన చూస్తుంటే అరాచకం అనే పదం జగన్ను చూసే పుట్టిందేమో అనిపిస్తోందని కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి అన్నారు. పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ప్రభుత్వ తీరును ఎండగట్టినందుకు అశోక్ బాబుపై కక్ష్య సాధిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించకూడదన్న రీతిలో సీఎం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.