ఆకాశంలోకి మరోసారి భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం రాకెట్ దూసుకెళ్లనుంది. వాలంటైన్స్ డే రోజు ఇస్రో సైంటిస్టులు కీలక ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు.ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ESO-04 ఈ నెల 14న నింగిలోకి పంపనున్నారు. 14న ఉదయం 5:59 గంటలకు PSLV సీ-52 రాకెట్ను శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ప్రయోగించనున్నారు. PSLV సిరీస్లో 17 వందల 10 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య సమకాలిక ధ్రువ కక్ష్యలోకి ఇస్రో పంపనుంది.ప్రయోగానికి ముందు కౌంట్డౌన్ 13న 4.29 గంటలకు మొదలవుతుంది. నిరంతరాయంగా 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. R1 SAT1 అని కూడా పిలిచే EOS-04 కాకుండా మరో రెండు చిన్న ఉపగ్రహాలను కూడా పోలార్ శాటిలైట్ వెహికల్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. INS-2TD అనేది భారతదేశం-భూటాన్ జాయింట్ శాటిలైట్ వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్లు, నేలపై ఉండే తేమ, హైడ్రాలజీ, వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత చిత్రాలను అందించడానికి రూపొందించిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహమే EOS-04 అని ఇస్రో తెలిపింది.ఈ ఏడాదిలో ఇది మొదటి ప్రయోగం. ఇస్రో ఛైర్మన్గా సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఈ ప్రయోగం చేపడుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రయోగం చేయనున్నారు. వాహన నౌకలో నాలుగు దశల అనుసంధానం పూర్తయిన తర్వాత… శిఖర భాగాన ఉష్ణకవచం ఉంచనున్నారు.