ఏజన్సీ ప్రాంతంలో తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురైన గిరజనులను కెజిహెచ్ కు తరలిస్తారు. అయితే కెజిహెచ్ లో ప్రత్యేకంగా ఒక ఎస్టి విభాగం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవలు అందించే వైద్యులు సమయానికి స్పందికపోవడంతో ఏ వైద్యుడు దగ్గరకు వెల్లాలో తెలియక ఈలోపు ప్రమాధస్దితి లో అమాయక గిరిజనలు మృత్యువాత పడుతున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల విశాఖ ఎజన్సీ జి. కె. వీధి మండలం గుమ్మలగొంది గ్రామానికి చెందిన జరతా. హేమంత్ కిడ్ని వ్యాధి తో అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా కెజిహెచ్ కు తరలించామని అరుకు పార్లమెంటు కార్యదర్శి దుక్కేరి. ప్రభాకర్ తెలిపారు. హేమంత్ కు డయాల్సిస్ చేయవలిసి వుండగా తీసుకుని వెల్లామని అక్కడ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేరని గేట్లు కు తాళాలు వేసి ఉన్నాయని గిరిజనులకు అత్యవుసర వైద్యసేవలు అందించాల్సిన ఎస్టి సెల్ వభాగం పని తీరు పై సంభదిత వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకొని ఎల్లప్పుడూ వైద్యసిబ్బంది ఉండేలా ఆధికార్లు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రభార్ డిమాండ్ చేసారు.