ప్రతి ఒక్కరూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని గజపతినగరం ఎస్. ఐ సి. హెచ్. గంగరాజు కోరారు. మంగళవారం గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు, మహిళల రక్షణ కోసమే ఈ యాప్ రూపొందించడం జరిగిందన్నారు. సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.