వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు చాలా ఆనందంగా ఉందని ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శృంగవరపుకోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి అన్నారు. శోభ హైమావతి శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావును సోమవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ. శోభా హైమావతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరిక ఆనందదాయకమని, పార్టీ అభివృద్ధికి మరింత బలం చేకూరిందని, అందరం కలిసి పార్టీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, డిసిసిబి చైర్మన్ వేచలపు వెంకట చిన రామునాయుడు, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, జిసిసి కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతి రాణి, సీనియర్ నాయకులు గొరపల్లి శివ, ఎమ్ పి పి లు నీలం శెట్టి గోపెమ్మ, దొగ్గ సత్యవంతుడు, జెడ్పీటీసీ మమ్ములూరి వెంకట లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ మూకల కస్తూరి, వైస్ చైర్మన్ బొంతల వెంకటరావు, వైస్ ఎమ్ పి పి లు కర్రి శ్రీనివాసరావు, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు మేలాస్త్రి అప్పారావు మరియు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.