కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను విభజించిన తీరుతోనే తెలంగాణ-ఏపీలు ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మైకులు ఆపేసి... ఎలాంటి చర్చ లేకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చేసిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్న మోదీ.... విభజించిన తీరును రాజ్యసభలో మరోసారి ఎండగట్టారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శమని పేర్కొన్నారు.