ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి ఆలయంలో రధసప్తమి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 11:00 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.ఉదయం 6 గంటల నుండి మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు.


కోవిడ్ కారణంగా స్వామివారి సేవలను ఊరోగింపుగానిర్వహించకుండా నాద నీరాజన మండపంలో ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు.ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారు 7 వాహానాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేషవాహనం పైనాఉదయం 11 గంటలనుండి 12 గంటల వరకు గరుడవాహనం


మధ్యాహ్నం 1 నుండి 2 వరకు హనుమంత వాహనం


మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు చక్రస్నానం


సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం


సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు గంటల వరకు సర్వభూపాల వాహనం


రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభవాహనం పై స్వామివారు అధిరోహిస్తారు. ఈ రోజు రథసప్తమి కారణంగా ఆలయంలో వర్చువల్ పద్దతిలో జరిగే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com